మహాబలిపురం బీచ్ లో చెత్తను ఏరివేసిన ప్రధాని మోదీ

-

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇవాళ రెండో రోజు భారత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మహాబలిపురం వేదికగా ఇవాళ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ, జిన్‌పింగ్‌ భేటీ కానున్నారు. ఇదిలా ఉండ‌గా.. స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన నరేంద్ర మోడి, మరోసారి తన విలక్షణతను చాటుకున్నారు. ఈరోజు ఉదయం మహాబలిపురంలో వాకింగ్, యోగా నిమిత్తం బీచ్ కు వచ్చిన ఆయన, అక్కడి చెత్తను చూసి దిగ్భ్రాంతి చెందారు.

ఆపై వెంటనే ఓ సంచీ తీసుకుని వచ్చి, అక్కడున్న ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, తాగి పారేసిన కూల్ డ్రింక్ బాటిల్స్ ఏరడం ప్రారంభించారు. తాను సేకరించిన చెత్తను కవర్లలో వేస్తూ, వాటిని వరుసగా పేరుస్తూ వెళ్లారు. ఇక ఈ దృశ్యాలను చూసిన లక్షలాది మంది ఆయన భారతావనికి రోల్ మోడలని కొనియాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news