2019లో వెండితెరపై కనిపించని హీరోలు వీరే…..!!

-

మరికొద్దిరోజుల్లో ఈ ఏడాది ముగియబోతోంది. అయితే ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా పలువురు హీరోలు మంచి సక్సెస్ఫుల్ సినిమాలు అందించడంతో పాటు మరికొందరు ఫెయిల్యూర్స్ ని మూటగట్టుకున్నారు. ఇక మరికొందరు అయితే ఈ ఏడాది ప్రేక్షకులు ముందుకు రానే లేదు. మరి ఆ విధంగా ఈ ఏడాది వెండితెరపై కనపడని ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం….!!

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత తరువాత, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీలో బిజీ అయ్యారు. దాదాపుగా ఏడాదిన్నరకు పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. కావున ఎన్టీఆర్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక మరొక నటుడు రవితేజ కూడా గత ఏడాది శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తరువాత డిస్కోరాజా సినిమాను కొంత ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ, ఆ సినిమా జనవరి 2020లో రిలీజ్ అవుతున్నందున ఈ ఏడాది రవితేజ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఇక గత ఏడాది జనవరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి తరువాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక మళ్ళి చాలా గ్యాప్ తరువాత ఆయన పింక్ అనే బాలీవుడ్ మూవీ రీమేక్ లో నటించానున్నారు.

అతి త్వరలో ఆ సినిమా సెట్స్ మీదను వెళ్లనుంది. ఇకపోతే మరొక నటుడైన అల్లరి నరేష్, రెండేళ్లుగా తన సినిమాల జోరుని పూర్తిగా తగ్గించారు. ఫాస్ట్ గా యాభైకి పైగా సినిమాల్లో అప్పట్లో నటించిన నరేష్, ఈ ఏడాది మహేష్ హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటించగా, ఆయన హీరోగా ఒక్క సినిమా కూడా ఈ ఇది రిలీజ్ కాలేదు. ఇక మరొక నటుడు అక్కినేని సుశాంత్. గత ఏడాది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిలసౌ అనే సినిమాతో ఆడియన్స్ నుండి ముందుకు వచ్చిన సుశాంత్, ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే మరొక నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుండి కూడా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. గత ఏడాది నా పేరు సూర్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ ని అందుకున్న అర్జున్,

ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలవైకుంఠపురములో సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కాగా ఆ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు వారి అబ్బాయి మంచు మనోజ్, రెండేళ్ల క్రితం వచ్చిన ఒక్కడు మిగిలాడు అనే సినిమా తరువాత సినిమాల్లో కనిపించలేదు. ఇటీవల భార్య నుండి విడాకులు తీసుకున్న మనోజ్, కొద్దిరోజుల క్రితం ఎమ్ ఎమ్ అనే పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఒకటి స్టార్ట్ చేసాడు. ఇక అక్కినేని వారి మరొక హీరో అయిన సుమంత్, గత ఏడాది సుబ్రహ్మణ్యపురం, ఇదం జగత్ అనే సినిమాల్లో నటించాడు, అయితే ఈ ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలుగా వచ్చిన కటనాయకుడు, మహానాయకుడు సినిమాల్లో మాత్రం ఒక ముఖ్య పాత్రలో కనిపించాడు సుమంత్.

ఇక యంగ్ హీరో నితిన్ నటించిన ఆఖరి సినిమా శ్రీనివాస కళ్యాణం గత ఏడాది ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని భీష్మ సినిమాను మొదలెట్టిన నితిన్, ఈ ఏడాది ఆ సినిమాను రిలీజ్ చేద్దామని భావించినప్పటికీ కుదరలేదు. ఆ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ హీరో సుధీర్ బాబు గత ఏడాది ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మోహనంలో హీరోగా నటించాడు. కాగా వీరభోగ వసంతరాయలు అనే సినిమాలో కూడా నటించిన సుధీర్ బాబు, ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం నాచురల్ స్టార్ నానితో కలిసి వి అనే డిఫరెంట్ యాక్షన్ మూవీ లో నటిస్తున్నాడు సుధీర్…….!!

Read more RELATED
Recommended to you

Latest news