బుగ్గనకు స‌వాల్ విసిరిన పుల్లారావ్.. అది నిరూపిస్తే 38 ఎకరాలు రాసిస్తా..

-

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్ర‌త్తిపాటి పుల్లారావ్ స‌వాల్ విసిరారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలకు, మాజీ మంత్రులకు భూములున్నట్లు అసెంబ్లీ వేదికగా రూట్ మ్యాప్‌తో సహా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ భూముల వ్యవహారంపై ఫస్ట్ టైమ్.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావ్ స్పందించారు.

‘నా పేరుతో మూడు గజాలు‌ చూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్దం. ఎవడో సురేష్ బినామీ అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఆ 38 ఎకరాలు‌ నిరూపిస్తే బుగ్గనకే రాసిస్తాను. లేకుంటే ఆయన రాజీనామా చేస్తారా..?’ అని ఈ సందర్భంగా బుగ్గనకు మాజీ మంత్రి పుల్లారావ్ సూటి ప్రశ్న సంధించారు. అయితే ఈ సవాల్‌పై బుగ్గన ఎలా రియాక్ట్ అవుతారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news