పెళ్లి జ‌రిపించిన పూజారితోనే పెళ్లికూతురు జంప్‌..! 

-

ఇప్పుడు కాలం ఒక‌ప్ప‌టిలా లేదు. ఒక‌ప్పుడు పెద్ద‌లు కుదిర్చిన పెళ్లిళ్లే ఎక్కువ‌గా జ‌రిగేవి. యువ‌తీ యువ‌కులు చాలా పిన్న వ‌య‌స్సులోనే వివాహాలు చేసుకునేవారు. కానీ ఇప్పుడ‌లా కాదు. ఎవ‌రికి న‌చ్చిన వారిని వారు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో కొన్ని సార్లు కొంద‌రు ఇష్టం లేని వివాహాలు కూడా చేసుకుంటున్నారు.  దీంతో వారు తాము పెళ్లి చేసుకున్న జీవిత భాగ‌స్వామిని విడిచిపెట్టి ప్రేమించిన వారితో పారిపోతున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ స‌రిగ్గా ఇలాంటిదే ఓ ఘ‌ట‌న జ‌రిగింది. దాని వివ‌రాల్లోకి వెళితే…

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని విదిశ జిల్లాకు చెందిన ఓ యువ‌తి (21)కి ఈ నెల 7వ తేదీన సిరోజ్ అనే ఓ యువ‌కుడితో వివాహం అయింది. ఆ త‌రువాత ఆమె ప‌లు కార‌ణాలు చెప్పి మెట్టింటి నుంచి పుట్టింటికి వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలోనే ఆమె ఈ నెల 23వ తేదీన రూ.1.50 ల‌క్ష‌ల విలువ చేసే ఆభ‌ర‌ణాలు, రూ.30వేల న‌గ‌దు తీసుకుని క‌నిపించ‌కుండా పోయింది. దీంతో ఆమె కుటుంబీకులు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే సిరోజ్‌కు, ఆ యువ‌తికి పెళ్లి చేసిన వినోద్ శర్మ అనే పూజారి కూడా క‌నిపించ‌డం లేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు వ‌చ్చింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టగా అస‌లు విష‌యం తెలిసింది. స‌ద‌రు వినోద్ శ‌ర్మ‌కు ఆ యువ‌తికి 2 సంవ‌త్స‌రాల నుంచే ప‌రిచయం ఉంద‌ని, వారు గ‌తంలో కొంత కాలం స‌హ‌జీవ‌నం కూడా చేశార‌ని పోలీసులు క‌నుక్కున్నారు. అలాగే వారిద్ద‌రూ పారిపోవాల‌ని కూడా అనుకున్నారు. కానీ ఆ యువ‌తికి సిరోజ్‌తో పెళ్ల‌యింది. ఇక ఆ పెళ్లిని కూడా పూజారి వినోద్ శ‌ర్మే జ‌రిపించాడు.

అయితే వివాహం అయ్యాక వినోద్ శ‌ర్మ‌, ఆ యువ‌తి  వేసుకున్న‌ ప్లాన్ ప్ర‌కారం.. ఆ యువ‌తి త‌న పుట్టింటికి వెళ్ల‌గానే.. ఆమె అక్క‌డి నుంచి న‌గ‌లు, న‌గ‌దు తీసుకుని పూజారి వినోద్ శ‌ర్మ‌తో పారిపోయింది. ఈ క్ర‌మంలో  పోలీసులు ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రి కోసం గాలిస్తున్నారు. కాగా వినోద్ శ‌ర్మ‌కు అంత‌కు ముందే వివాహం అయింద‌ని, అత‌నికి ముగ్గురు పిల్ల‌లు కూడా ఉన్నార‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఏది ఏమైనా ఇప్పుడీ వార్త మాత్రం నెట్‌లో వైర‌ల్ అవుతోంది..!

Read more RELATED
Recommended to you

Latest news