ముంబైలో కోటీ డెబ్బై లక్షల విలువైన పాము విషం స్వాధీనం

-


చూశారుగా పైన ఫోటో. బాటిల్‌లో ఉన్నది పాము విషం. ఎన్ని పాములను పిండితే అంత విషం వస్తుందో ఊహకు కూడా అందదు. వేల పాముల నుంచి సేకరించిన విషంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని మంద్వా జెట్టీ అనే ఏరియాలో పోలీసుల తనిఖీల్లో పాము విషాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ సుమారు కోటీ డెబ్బై లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. విషాన్ని సీజ్ చేసిన అధికారులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను విచారిస్తున్నారు. ఆ విషాన్ని డ్రగ్స్, వస్తువుల తయారీ, ఔషధాల్లో ఉపయోగించనున్నట్లు ఆ దుండగులు పోలీసులకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news