దారి కాచి మరీ రోడ్డు మీద వెళ్తున్న వారిపై ఎద్దు దాడి.. వైరల్ వీడియో

-

అలాగే అక్కడే నిలబడ్డ ఎద్దు… బైక్ పై వస్తున్న మరో వ్యక్తిపై కూడా దాడి చేసింది. దీంతో బైక్ తో సహా ఆ వ్యక్తి కింద పడ్డాడు. ఇలా ఆ ఏరియాలో వెళ్తున్న వాళ్లపై దాడి చేయబోయిన ఆ ఎద్దును వెంటనే అధికారులు గోశాలకు తరలించారు.

సాధారణంగా ఎవరిమీదనైనా పగ ఉంటే దారి కాచి వాళ్లపై దాడి చేస్తుంటారు కొందరు. అది సాధారణం. అటువంటి ఘటనలు ఎన్నో చూశాం. కానీ.. గుజరాత్ లోని రాజ్ కోట్ లో మాత్రం ఓ ఎద్దు దారి కాచి మరీ.. ఆ రోడ్డు మీద వెళ్తున్న వారిపై విరుచుకుపడింది. ముందుగా సైకిల్ పై వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసిన ఎద్దు అతడు పారిపోవడానికి ప్రయత్నించినా అతడిని కొమ్ములతో ఢీకొట్టింది. అక్కడ ఉన్న స్థానికులు ఎద్దును వారించి అతడిని ఇంట్లోకి తీసుకెళ్లడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

అలాగే అక్కడే నిలబడ్డ ఎద్దు… బైక్ పై వస్తున్న మరో వ్యక్తిపై కూడా దాడి చేసింది. దీంతో బైక్ తో సహా ఆ వ్యక్తి కింద పడ్డాడు. ఇలా ఆ ఏరియాలో వెళ్తున్న వాళ్లపై దాడి చేయబోయిన ఆ ఎద్దును వెంటనే అధికారులు గోశాలకు తరలించారు. దీంతో అక్కడి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news