తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు..కొత్తగా 1,335 పాజిటివ్‌ కేసులు..8 మరణాలు.

-

తెలంగాణాలో కరోనా విజృంభన కొనసాగుతుంది..రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రెండు లక్షలు దాటాయి..గత 24 గంటల్లో కొత్తగా 1,335 పాజిటివ్‌ కేసులు ,8 మరణాలు నమోదు అయ్యాయి..ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 611కి చేరాయి..రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం 1,171 మరణాలు నయోదయ్యాయి..కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం టీఎస్‌లో గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌ 262, రంగారెడ్డి 137, మేడ్చల్ 91 నమోదయ్యాయి..రాష్ట్రంలో 27,052 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని…ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని లక్ష 72 వేల 338 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు హెల్త్‌ బులిటెన్‌లో ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news