ఆస్పిరిన్‌ వాయు కాలుష్యం నుంచి రక్షిస్తుందా?

-

ఆస్పిరిన్‌ టాబ్లెట్‌ గురించి మనలో తెలియని వారు ఉండరు. ఒంట్లో జ్వరం వచ్చినా, నీరసంగా ఉన్నా, ఈ టాబ్లెట్‌ను వాడుతుంటారు. అంతేకాకుకుండా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నవారు డాక్టర్ల సూచన మేరకు ఈ మందు బిల్లను ఉపయోగిస్తారు. అయితే, పరిశోధకులు ఆస్పిరిన్‌ టాబ్లెట్‌పై నిర్వహించిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలువడ్డాయి. ఈ టాబ్లెట్‌ ఉపయోగించడంతో వాయు కాలుష్యం ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని పరిశోధకులు అధ్యయనంలో కనుగొన్నారు.


నొప్పిని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్‌ ఆస్పిరిన్‌ తీసుకునే వయోవృద్ధులు కొంతమేర వాయు కాలుష్యం వల్ల ఏర్పడే స్వల్పకాలిక సమస్యల నుంచి రక్షణ పొందార ని తెలిసింది. దీనిపై అమెరికాలోని బోస్టన్‌లో దాదాపు వెయ్యి మందిపై నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఆస్పిరిన్‌ తీసుకున్న వారిలో కాలుష్యం ఒక మోస్తరుగా ఉన్న సందర్భంలో వారు ఊపిరి తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడలేదు.

కానీ, ఆస్పిరిన్‌ ట్యాబ్లెట్‌ను తీసుకోవడంతో మెదడు పనితీరుపై అది చూపే ఫలితాలను పరిశోధకులు కనుగొనలేకపోయారు. కానీ, నాన్‌ స్టీరాయిడ్‌ యాంటీ ఇన్ఫ్లమేటరీలను తీసుకుంటున్న వారికి నిర్వహించిన పరీక్షలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత విషయంలో గణనీయమైన మార్పులను కనుగొన్నారు. వీరి అధ్యయనం ప్రకారం స్వల్పకాలిక వాయు కాలుష్యానికి గురైన వారిలో స్వల్పకాలిక మార్పులు సంభవించాయి. అధిక వాయు కాలుష్యం వల్ల∙వారిలో మెదడులో కొంత నొప్పి ఏర్పడింది. ఆస్పిరిన్‌ టాబ్లెట్‌ తీసుకున్న వారిలో మెదడులో ఏర్పడే నొప్పి కాస్త తగ్గుతుందని పరిశోధకులు చేసిన స్టడీలో తేలింది.

కానీ, ఆస్పిరిన్‌ ఏవిధంగా వాయుకాలుష్యం నుంచి ఏర్పడే సమస్యలపై పెద్ద ఎత్తున క్లినికల్‌ స్టడీలు చేయాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. ఆస్పిరిన్‌ వాడకంతో వాయుకాలుష్య ప్రభావానికి వెంటనే చెక్‌ పెట్టలేము. ఈ టాబ్లెట్‌ను తక్కువ మోతాదులో తీసుకున్న అధిక మొత్తంలో రక్తస్రావం జరిగే చాన్‌ ఉందని పరిశోధకులు హెచ్చరించారు. వాయుకాలుష్యానికి ఎక్కువగా గురైన వారిలో అల్జీమర్స్‌ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news