ఆ రెండు రాశుల వారు భలే తెలివైన వారట..!

-

మీరు చాలా తెలివైన వారండీ.. అని అనిపించుకోవాలని ఎవరికి ఉండదు. కొందరికి తెలివి తల్లిదండ్రుల నుంచి వస్తే.. మరికొందరు పుట్టుకతోనే జీనియస్‌గా పుడతారు. ఇంకొందరు పెరుగుతున్న కొద్దీ.. పరిస్థితులను చూస్తూ అనలైజ్ చేస్తూ తెలివైన వారిగా మారతారు. అయితే 12 రాశుల్లో ఓ రెండు రాశుల వారు మాత్రం అత్యంత తెలివైన వాళ్లట. ఈ విషయాన్ని ఆస్ట్రాలజీ ప్రముఖులు తేల్చారట. మరి అవి ఏ రాశులు.. ఆ తెలివైన వారిలో మీరు కూడా ఉన్నారా తెలుసుకోండి.

రాశిచక్రంలో ఉన్న 12 రాశులు మనుషుల భవిష్యత్‌ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. మనం పుట్టిన నక్షత్రం, రాశి, పాదం ప్రకారం మన భవిష్యత్ ఎలా ఉండబోతోందో జ్యోతిష్యులు అంచనా వేయగలుగుతారు. అయితే ఇవేమీ లేకుండా కేవలం రాశులను బట్టి మనుషులు తెలివైన వారా లేదా అని డిసైడ్ చేయొచ్చంట. ముఖ్యంగా 12 రాశుల్లో ఓ రెండు రాశుల వారు మాత్రం చాలా తెలివైన వారంట. ఈ విషయాన్ని జ్యోతిష్యులు తేల్చారు. ఇంతకీ ఆ రాశులు ఏంటంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కుంభ, వృశ్చిక రాశుల వారు చాలా తెలివైన వారట. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన మయో స్కూల్ ఆఫ్ ఆస్ట్రాలజీలో పనిచేసే నీల్ క్రాబ్ ట్రీ తెలిపారు. ఇందులో కుంభ రాశి వారు దేని గురించైనా సరే విశ్లేషించడంతో తిరుగులేని వారిగా గుర్తింపు పొందుతారట. మరి వృశ్చిక రాశి వారేమో.. పరిస్థితులకు తగ్గట్లుగా తెలివిగా వ్యవహరించడంలో దిట్టగా పేర్కొంటారు.

నీల్ క్రాబ్ ట్రీ కథనం ప్రకారం కుంభరాశి వారు పుట్టుకతోనే మంచి ఐక్యూతో పుడతారట. అంతేకాకుండా వీరి ఆలోచనలు ఎక్కువ శాతం విశ్లేషణాత్మకంగా ఉంటాయట. ఇంటెలిజెన్స్ లో వీరిని ఢీ కొట్టేవారే లేరన్నది ఆయన అభిప్రాయం. వీరి వివరణలు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటాయట. వృశ్చిక రాశి వారు కుంభ రాశిలా కాదట. వీరు ప్రాక్టికల్ నాలెడ్డ్‌లో ముందుంటారట. అప్పటికప్పుడు తెలివిగా ఆలోచించి తమ సమస్యల నుంచి బయటపడే శక్తి వృశ్చిక రాశి వారికి ఉంటుందట.

ఈ రెండు రాశులతో పాటు వృషభం, కన్య, మకర రాశుల వారు కూడా తెలివైన వారే అట. వీరు వృశ్చిక రాశి వారిలా ప్రాక్టికల్‌గా ఆలోచించి తమ సమస్యల నుంచి బయటపడుతుంటారని నీల్ క్రాబ్ ట్రీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news