ముంగీసలతో దోస్తీ చేస్తున్న వ్యక్తి… ప్రాణం మీదకు వస్తే పరిగెత్తుకుంటూ వస్తాయట..!!

-

కుక్కలన్ని, పిల్లుల్ని పెంచుకునే వాళ్లను చూసి ఉంటాం.. వాటితో స్నేహం చేసేవాళ్లు ఉన్నారు.. ఉత్తరప్రదేశ్‌ మీరట్‌ సమీపంలో ఓ వ్యక్తి ఏకంగా ముంగీసలను పెంచుకుంటున్నాడు. వాటికి రోజు ఆహారం పెడుతూ వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు..విచిత్రం ఏమిటంటే ముంగీసలు వాసన చూస్తే పాములు ఇట్టే పసిగడతాయి. అలాంటి ప్రమాదకరమైన బల్లి జాతికి చెందిన జంతువుల్ని తన గుడిసె పక్కనే పెట్టుకొని ఆ వ్యక్తి పెంచుకుంటున్నాడు. దీనికి వెనుక పెద్ద కథే ఉందట..
హస్తినాపూర్ ఖాదర్ ప్రాంతంలోని తారాపూర్ గ్రామంలో ఉన్న సాగర్ కుటీకి చెందిన మహంత్ సాగర్ గిరి మహారాజ్ స్టోరీ ఇది..12 ఏళ్లుగా.. ముంగీసలంటే మహంత్‌ సాగర్‌ మహరాజ్‌కి ఎంతో ఇష్టం. పాములకు బద్దశత్రువులుగా భావించే ముంగీసలు మాత్రం మహరాజ్‌ బాబాను గురువుగా భావిస్తున్నాయి. సాగర్ కుటీ తారాపూర్ గ్రామంలో ఉంది. 108 సాగర్ గిరి జునా అఖారా మహంత్ ఉన్న ప్రాంతం, ఇక్కడ గత 15 సంవత్సరాలుగా గుడిసె నిర్మించుకుని నివసిస్తున్నారు.
2010లో ఖాదర్ ప్రాంతంలో గంగా నదికి తీవ్ర వరద వచ్చినప్పుడు సుమారు 35గ్రామాలను వరద ముంచెత్తిచింది.. అదే సమయంలో తన గుడిసె చుట్టూ వరదనీరు చేరడంతో అర డజను ముంగీసలు వచ్చి గుడిసెలో తలదాచుకున్నాయని మహంత్ చెప్పారు. ముంగీసలకు తన గుడిసెలోనే ఆశ్రయం ఇచ్చి వాటికి ఆహారం పెట్టాడు. వరద నీరు తగ్గగానే ముంగీసలు తిరిగి అడవికి వెళ్లాయి.
పోయిన ముంగీసలు అడవిలో ఉండకుండా రోజూ మహంత్‌ నివసిస్తున్న గుడిసె దగ్గరకు రావడం మొదలుపెట్టాయి. ఈ విధంగా 12సంవత్సరాల నుంచి ముంగీసలు మహంత్ గుడిసె చుట్టూ తిరుగుతూ అతను పెట్టే ఆహారం తింటూ అతనికి మంచి స్నేహితులుగా మారాయట…ఈ క్రమంలోనే ఒక పెద్ద నాగుపాము తన గుడిసె వద్దకు వచ్చిందని, అది చూసి తాను భయపడి, అరవడంతో, రోజూ మాదిరిగానే, ముంగీసలు పరుగెత్తుకుంటూ వచ్చి నాగుపామును గుడిసె దగ్గర నుంచి తరిమివేశాయట..అంతే కాదు తన దగ్గర ఎలాంటి వన్యప్రాణులు, ప్రాణహాని కలిగించే జంతువులు వచ్చినా గట్టిగా అరిస్తే చాలు ముంగీసలు తాను ఉంటున్న గుడిసె దగ్గరకు వచ్చి రక్షణగా ఉంటున్నాయని మహారాజ్‌ అంటున్నారు..బాబాను చూడగానే ముంగీసలు పరుగులు పెడుతూ వస్తున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ విచిత్రమైన స్నేహాన్ని చూసి హస్తినాపూర్‌లో నివసిస్తున్న వారితో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news