అత్యంత వేగంగా వెళ్లే ట్రెయిన్ పేరు మార్చారు.. ఇక నుంచి ‘ట్రెయిన్ 18’ కాదు..!

-

India's fastest indigenous train train 18 renamed as Vande bharat express

ట్రెయిన్ 18 తెలుసు కదా. భారతదేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే రైలు.. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ ట్రెయిన్‌కు ఇంజిన్ ఉండదు. ఢిల్లీ, వారణాసి మధ్య తిరగనున్న ఈ ట్రెయిన్ పేరును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ట్రెయిన్ పేరును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్టు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో కేవలం 18 నెలల్లోనే ఈ ట్రెయిన్‌ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. మొత్తం 16 ఏసీ కోచ్‌లతో ఉండే ఈ ట్రెయిన్ కాన్పూర్, అలహాబాద్‌లో మాత్రమే ఆగుతుంది. శతాబ్దీ ట్రెయిన్ల కన్నా ఫాస్ట్‌గా వెళ్లడమే కాదు.. అత్యాధునిక సౌకర్యాలు ఈ ట్రెయిన్ సొంతం. ఢిల్లీ నుంచి వారణాసి మధ్య 755 కిలోమీటర్లు ఉండగా… ఈ ట్రెయిన్ కేవలం 8 గంటల్లోనే వెళ్తుంది. అందుకే ఈ ట్రెయిన్‌కు అత్యంత వేగంగా వెళ్లే ట్రెయిన్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఉన్న రైళ్లు ఢిల్లీ నుంచి వారణాసికి 11 నుంచి 12 గంటల్లో వెళ్తాయి.

India's fastest indigenous train train 18 renamed as Vande bharat express

Read more RELATED
Recommended to you

Latest news