బ‌లిచ‌క్ర‌వ‌త్తి త‌ప‌స్సుతో వ‌చ్చిన శివ‌లింగం ఏపీలో ఎక్క‌డ ఉందో తెలుసా..

-

విశాఖజిల్లా నర్సీపట్నానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బలిఘట్టంలో శివాలయం 16వ శతాబ్థంలో చోళులు నిర్మించినది. ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి పక్కన ఉన్న వరాహానది ఉత్తరంగా ప్రవహించడం వల్ల దక్షిణకాశీగా ఈ క్షేత్రం గుర్తింపు పొందింది. బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఇక్కడ శివలింగం స్థాపించినట్టు, దీంతో బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందినట్టు కథనం. ఆలయానికి సమీపంలో వరాహానది ఉత్తర వాహినిగా పేరుపొంది విష్ణుదేవుని ప్రసాదంగా వినుతికెక్కింది.

హిరాణ్యాక్షుని వెంటాడుతూ విష్ణువు వరాహారూపంలో భూమిని చేరుకుని పయనించడం వల్ల ఆ సమయంలో బలిచక్రవర్తి తపస్సుకు వెచిచ బ్రహ్మ ప్రసాదించిన శివలింగానికి అభిషేకం నిమిత్తం నీరు కావాలని విష్ణుమూర్తిని కోరగా వరాహా రూపంలో ఉన్న విష్ణు ఈ మార్గం గుండా నదిని ఏర్పరడంతో వరాహానదిగా పేరుగాంచినట్టు చెబుతున్నారు. త్రిశూల పర్వతంపై ఇక్కడి ఆలయం ఉంది. సమీపంలో విభూది గనులు ఉన్నాయి. ఈ ప్రాంతం కార్తీకమాసంలో, శివరాత్రి ఉత్సవాల్లో భక్తులతో కోలాహలంగా ఉంటుంది. శివరాత్రి పర్వదినాల్లో లక్షమంది భక్తులు వస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news