కొత్త 20 రూపాయల నోటు వచ్చేస్తోంది…!

-

ఈ నోటు భారతదేశ సాంస్కృతిక సంపదకు నిదర్శనంగా ఆర్బీఐ వెల్లడించింది. గ్రీనిష్ ఎల్లో అంటూ కొంచెం ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులను మిక్స్ చేసిన రంగులో ఈ కొత్త నోటు ఉండబోతోంది.

డీమానెటైజేషన్ ఎప్పుడైతే జరిగిందో.. అప్పటి నుంచి భారతీయులు కొత్త కొత్త నోట్లను చూస్తున్నారు. ఇదివరకు కొత్త 500 నోట్లు, 2000 నోట్లు, ఆ తర్వాత కొత్త 100 నోట్లు, రెండు వందల నోట్లు, 50 నోట్లు, 10 రూపాయల నోట్లు ఇలా అన్నీ కొత్త నోట్లు పలకరించాయి.

RBI to issue new 20 rupees note

ఇప్పుడు మరో ముందడుగేసిన ఆర్బీఐ కొత్త 20 నోటును కూడా తీసుకొస్తోంది. ఈనోటుకు ఒకవైపు మహాత్మా గాంధీ బొమ్మ ఉంది. మరోవైపుకు ఎల్లోరా గుహలు ఉన్నాయి. ఈ నోటు భారతదేశ సాంస్కృతిక సంపదకు నిదర్శనంగా ఆర్బీఐ వెల్లడించింది. గ్రీనిష్ ఎల్లో అంటూ కొంచెం ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులను మిక్స్ చేసిన రంగులో ఈ కొత్త నోటు ఉండబోతోంది. కొత్త 20 నోటు చెలామణిలోకి వచ్చినా.. పాత 20 నోటు కూడా చెలామణిలో ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news