ప్రాణాలతో చెలగాటం ఆడుతూ లైవ్ రిపోర్టింగ్.. వీడియో వైరల్

-

ఎవరూ తీసుకురాలేని.. ఏ చానెల్ కవర్ చేయలేని వార్తను నువ్వు తీసుకురావాలి.. అని ప్రొడ్యూసర్ చెప్పడంతో ఇదిగో ఇలా ప్రాణాలకు తెగించి మరీ… వరద నీటిలో రిపోర్టింగ్ చేస్తున్నాడంటూ ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది.

మీకు గుర్తుందా? ఓసారి పాకిస్థాన్ కు చెందిన ఓ రిపోర్టర్ గాడిద మీద కూర్చొని రిపోర్టింగ్ చేస్తుంటే.. గాడిద జాడిచ్చి తన్నేసరికి బొక్క బోర్లా పడ్డాడు. అప్పట్లో ఆ ఘటన సంచలనమే సృష్టించింది. తాజాగా మరో రిపోర్టర్ చేసిన వెరైటీ రిపోర్టింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాకిస్థాన్ కు చెందిన ఓ రిపోర్టర్ ఏకంగా వరద నీటిలోకి వెళ్లి మరీ రిపోర్టింగ్ చేశాడు. లైవ్ లో వరద నీటిలో సగం వరకు వెళ్లి రిపోర్టింగ్ చేయడం సంచలనం సృష్టించింది. ఎవరూ తీసుకురాలేని.. ఏ చానెల్ కవర్ చేయలేని వార్తను నువ్వు తీసుకురావాలి.. అని ప్రొడ్యూసర్ చెప్పడంతో ఇదిగో ఇలా ప్రాణాలకు తెగించి మరీ… వరద నీటిలో రిపోర్టింగ్ చేస్తున్నాడంటూ ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు.. నెటిజన్లు ఆ రిపోర్టర్ పై తెగ విరుచుకుపడుతున్నారు. ఏంది బాబు ఇది.


ఏం రిపోర్టింగ్ ఇది. ప్రాణాలకు తెగించి మరీ రిపోర్టింగ్ చేయడం అవసరమా? ప్రతి ఒక్కరికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది అంటూ విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news