ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం ఇదే..అక్కడికి వెళితే ప్రాణాలు పోయినట్లే..

-

ఈ భూ ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి.. అలాగే ఎన్నో ప్రమాదకరమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి.వాటిని దగ్గరకు వెళ్ళాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి.ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైన ప్రాంతాలు..అక్కడికి వెళ్లి ఓ నిమిషం పాటూ నిల్చుంటే చాలు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాసేపటికే మరణిస్తారు. అందుకే దాన్ని ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన ప్రాంతంగా పిలుస్తారు.ఆ ప్రాంతం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

ఆ ప్రాంతం పేరు ‘ఎలిఫెంట్ ఫుట్ ఆఫ్ చెర్నోబిల్’. ఇది ఉక్రెయిన్లో ఓ నేలమాళిగ. దీని చుట్టుపక్కలకి ఎవరూ వెళ్లరు. ఇప్పటికీ ఆ ప్రదేశం ఉన్న ఊరు ఎడారిలా మారిపోయింది. ఊరంతా ఎప్పుడో ఖాళీ అయిపోయింది. దాదాపు 50,000 మంది ప్రజలు ఎక్కడికో వెళ్లిపోయారు. కొంతమంది క్యాన్సర్ వంటి రోగాలబారిన పడి చనిపోయారు. ఇప్పటికే ఆ ప్రాంతంమంతా ఓ ఘోస్ట్ సిటీలా ఉంటుంది..ఉక్రెయిన్ లోని ప్రీప్యాట్ అనే ఊరిలో జరిగింది ఇదంతా. 1986 నుంచి ఆ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. అప్పట్నించి ఆ ఊరు మనుషులు లేని ఎడారిలా అయిపోయింది. అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ ఉంది. దాన్ని కూడా వదిలేసి అందరూ వెళ్లిపోయారు..

1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్ డిజాస్టర్ జరిగింది. అదొక న్యూక్లియర్ ప్రమాదం. ప్రీప్యాట్ గ్రామానికి దగ్గర్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ లోనే ఇది జరిగింది. దీంతో అక్కడ ఎప్పుడు చాలా ఎక్కువ రేడియేషన్ స్థాయిలు ఉంటాయి. ఇక్కడే ఉంది ‘ఎలిఫెండ్ ఫుట్ ఆఫ్ చెర్నోబిల్’ అని పిలిచే నేలమాళిగ. చెర్నోబిల్ అణు విపత్తు తరువాత ఇది చాలా ప్రమాదకరంగా మారింది. ఆ గదిలో రేడియో ధార్మిక ద్రవ్యరాశి చాలా అధిక మొత్తంలో ఉంటుంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇంకా నేల మాళిక విషపూరితమైన వాయువులతోనే నిండి ఉంది..2 మీటర్ల మేర రేడియో దార్మిక వాయువు బురదగా ఏర్పడింది..దాంతో ఎవరూ అక్కడికి వెళ్ళడానికి సాహసించలేదు..

అణు విపత్తు జరిగాక పదేళ్ల వరకు ఎవరూ అక్కడికి వెళ్లలేకపోయారు. తరువాత 1996లో ఒక వ్యక్తి మాత్రం అతి జాగ్రత్తలు తీసుకుని ఇలా వెళ్లి అలా ఫోటో తీసి వచ్చేశాడు. అక్కడికి వెళ్లడానికి ఎవరూ ధైర్యం చేయలేదు.అక్కడున్న రేడియోధార్మికత శక్తి తగ్గాలంటే పదివేల ఏళ్లు పడుతుంది. అప్పుడు కానీ ఆ ప్రాంతం మళ్లీ జనాలతో కళకళలాడదు. ఆ అణు ప్లాంట్ కు దగ్గరలో ఉన్న ప్రీప్యాట్ గ్రామం కూడా జనాలతో నిండాలంటే ఇంకా సమయం పడుతుంది. కారణంగా అక్కడున్న గాలిలో రేడియోధార్మికత నిండిపోయింది. దీంతో ప్రజలు చనిపోవడం, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడి తక్కువ కాలంలోనే మరణించడం జరుగుతోంది.ఒకప్పుడు రిచ్ ఏరియాగా అందమైన భవంతులతో నిండిన ఆ ప్రాంతం అంతా ఇప్పుడు మనుసులు లేక దెయ్యాల దీవిగా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news