ఈ బర్గర్ తింటే.. రూ.25,000 ఇస్తారు..

-

పర్యాటకులకు స్వర్గధామం అంటే థాయ్ లాండ్ అనే చెప్పాలి. అక్కడ ఉండే బీచ్ లు, ఎంతో అందంగా కనిపించే ద్వీపాలు ఆ దేశస్తుల సాంప్రదాయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అంతేకాదు ఆ దేశం పగటి పూట కంటే కూడా రాత్రి వేళ్లలో ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలో క్రిస్ స్టీక్స్ అండ్ బర్గర్స్ అనే రెస్టారెంట్ తిండి పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో భాగంగా ఓ బర్గర్ ను కేవలం 9 నిమిషాల్లో తినాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో బర్గర్ లాగించినవారికి రూ.25 వేలు ఇస్తారు.

ఓ‍హ్ ఇంతేనా బర్గర్ తినడమేగా అనుకుంటున్నారా.. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. విషయం ఏంటంటే, ఈ బర్గర్ అలాంటిఇలాంటిది కాదు. దీని బరువు 6 కిలోలు. థాయ్ లో రూపొందించే బర్గర్లన్నింటికి ఇదే పెద్దన్న. మరి దీన్ని 9 నిమిషాల్లో తినడం అంటే మామూలు విషయం కాదు. అందుకే క్రిస్ స్టీక్స్ అండ్ బర్గర్స్ వారు ఎంతో ధీమాగా ఈ పోటీ పెట్టారు. ఇప్పటివరకు ఈ బర్గర్ ను తినేందుకు వచ్చినవాళ్లు 15 నిమిషాల వరకు టైమ్ తీసుకుంటున్నారట. దాంతో ఎవరూ కూడా పాతికవేల క్యాష్ ప్రైజ్ నెగ్గలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news