ఓటమి అనివార్యమైతే బాధ్యతగా వ్యవహరిస్తా..రేవంత్

-


తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకర్గంలో మొదటి నుంచి వెనుకంజలో ఉండటంతో ఆయన మీడియాతో స్పందిస్తూ…ప్రజా తీర్పుని శిరసా వహిస్తా అన్నారు. ఒక వేళ ఓటమి అనివార్యమైతే బాధ్యతగా వ్యవహరిస్తా అన్నారు. తెలంగాణ ప్రజలు ఏక పక్షంగా తెరాసకు మద్దతుగా ఓట్లు వేయడంతో తెరాసపై ప్రజలు మరింత నమ్మకం పెట్టుకున్నారని వివరించారు. ఈ విషయాన్ని గమనించి కేసీఆర్, కేటీఆర్‌ ఈ విజయాన్ని గుర్తించి పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ ఓటమి దిశగా ప్రయాణించడాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news