కూకట్ పల్లిలో క్షుద్ర పూజల కలకలం.. హత్య చేసి శవాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

-

టెక్నాలజీ ఎంత మారినా ప్రజలను మూఢనమ్మకాలు అనేవి అసలే వదలడం లేదు. అవగాహన లేమితో గుడ్డిగా మూఢనమ్మకాలను అనుకరిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో క్షుద్ర పూజలు చేసి యువకుడిని హతమార్చిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

ఈ ఘటన హైదర్ నగర్ లోని అలీ తలాబ్ స్మశాన వాటిక వద్ద చోటుచేసుకుంది. కాలిపోయిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య చేసి శవాన్ని తగలబెట్టి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. పరిసర ప్రాంతాలలో క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

రేపు అమావాస్యతో పాటు సూర్యగ్రహణం ఉండడంతో బలి ఇచ్చి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ యువకుడి వివరాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు. ఘటనా స్థలంలో క్లూస్ టీం తో ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news