నా అకౌంట్లో బోలెడు డబ్బులున్నాయ్: మల్లారెడ్డి

-

తన బ్యాంక్ అకౌంట్లో బోలెడు డబ్బులున్నాయంటూ మంత్రి మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నాకు 800 ఎకరాలున్నాయ్. కానీ 300 గజాల ఇంట్లో ఉంటా. బ్యాంకు నిండా పైసలున్నాయ్. 65వేల మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నా ఇన్స్టిట్యూట్స్ చదువుతున్నారు. వద్దన్నా అకౌంట్లో పైసలు పడుతున్నాయ్. నాపై ఇప్పటికే మూడుసార్లు ఐటీ రైడ్స్ అయ్యాయ్. ఐటీ రైడ్ అయితే మంచిగ అనిపిస్తది. ఫ్రెష్ అయిపోతా’ అని పేర్కొన్నారు.

I-T raids premises of Telangana minister, kin; ₹4.80 crore seized from  aides | Latest News India - Hindustan Times

1980 నుంచి 1990 మధ్య కాలంలో పాల వ్యాపారం చేసానని , 1990 నుంచి 2000 వరకూ బోర్ వెల్స్ నడిపించానని , 2000 తరువాత పూల వ్యాపారం చేసి, స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆ తరువాత మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించి కష్టపడి ఈ స్థాయికి ఎదిగానన్నారు. తాను చెప్పే పాలమ్మినా, పూలమ్మినా అని చెప్పే డైలాగ్ తన జీవితకాలం కష్టం చెప్పుకొచ్చారు. నేను ఈ డైలాగ్ ను ఎక్కడి నుంచో తీసుకురాలేదని తన వృత్తి గురించి చెబుతుంటే ఫేమస్ అయిపోయిందని అన్నారు. ఈరోజుల్లో ఎక్కడ చూసిన నా వీడియోలే దర్శనం ఇస్తున్నాయని.. నేను తుమ్మినా తుఫాన్ అయిపోతుందని సరదాగా చెప్పుకొచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కన్నా తానే ఫేమస్ అని కీలక వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news