వైసీపీ అధినేతకు విషెస్ చెప్పిన తెరాస ఎంపీ కవిత

-


నేడు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి జగన్‌కు వినూత్న పద్ధతిలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ అధినేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపమని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘జగన్ అన్న.. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే’ అంటూ కవిత ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్‌‌కు జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ‘థ్యాంక్యూ ఫర్ యువర్ వార్మ్ విషెస్’ అంటూ జగన్ రీట్వీట్ చేశారు.

దీంతో అటు తెలంగాణ, ఏపీలోని వైఎస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. సో… రాజన్న పుత్రునికి మన తరుఫు నుంచి కూడా హ్యాపీబర్త్‌డే చెప్పేందాం.

Read more RELATED
Recommended to you

Latest news