గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

-

గుజరాత్ లో అకస్మాత్తుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్, కారు ఢీ కొని అక్కడికక్కడే పది మంది దుర్మరణం చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ వడోదర ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అంబులెన్సులతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

క్షతగాత్రులను సమీపం లోని  ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. రోడ్డు ప్రమాదంలో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు వాహనాలను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు కంటతడి పెట్టిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news