11 ఏళ్ల గిరిజన బాలికపై 27 ఏళ్ల యువకుడు అత్యాచారం జరిగింది. ఈ కేసులో పోక్సో కేసు నమోదు అయింది. కాంగ్రెస్ సర్కార్ చేతకానితనంతో తెలంగాణ రాష్ట్రంలో 469 కి చేరిన పోక్సో కేసుల సంఖ్యకు చేరిందని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి 27 ఏళ్ల యువకుడు పాల్పడ్డాడు. కిరాణా షాపునకు వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై బలవంతంగా ఎక్కించుకొని, పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు భూక్య హరి అనే యువకుడు. ఇక బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.