మహిళా దినోత్సవం రాగానే మహిళలు యాదికొచ్చారు దొరకు – వైఎస్ షర్మిల

-

మహిళా దినోత్సవం రాగానే మహిళలు యాదికొచ్చారు దొరకు అంటూ సిఎం కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ పైన ఉన్న లో రాణీ రుద్రమ దేవి విగ్రహానికి నివాళులు అర్పించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలిపారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, ఎన్నికల ఏడాదిలో మహిళా దినోత్సవం రాగానే మహిళలు యాదికొచ్చారు దొరకు. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి, మూడేండ్లుగా దాదాపు 4వేల కోట్ల బకాయిలు చెల్లించలేదని విమర్షలు చేశారు. రాష్ట్రంలోని 46.10లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను KCR మోసం చేశారు. ఇప్పుడు పట్టుమని 750కోట్లు ఇచ్చి, మహిళల పట్ల మరోసారి కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారన్నారు. KCR తీరుతో మహిళలే ఆపసోపాలు పడి, బ్యాంకర్లకు వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి. మహిళల పట్ల KCRకు నిజంగానే ప్రేమ ఉంటే పూర్తిగా 4వేల కోట్ల బకాయిలు చెల్లించాలి. 750 కోట్లకు చిన్నదొర కృతజ్ఞత చెప్పడం మానేసి, KCR ముక్కు పిండి బకాయిలు వసూలు చేయించాలని కోరారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news