తెలంగాణలో మరో 159 బార్లు..!

-

తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో మరికొన్ని బార్లు అందుబాటులోకి రానున్నాయి. 72 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 159 బార్లకు ఆ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 55, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 104 బార్లు ఏర్పాటు కానున్న నేపథ్యంలో నిన్నటి నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

bar

లాటరీ ద్వారానే..

ఫిబ్రవరి 10న ఆయా జిల్లాల కలెక్టర్లు లాటరీ పద్ధతిలో బార్లను కేటాయిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 11న డ్రా తీసి బార్లు పొందిన వారి లిస్ట్‌ను ఆ తర్వాతి రోజు ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లు.. ఎక్సైజ్‌ కమిషనర్‌కు పంపగా, 13న జీహెచ్‌ఎంసీ లిస్ట్‌ పంపుతారు. ఆ తర్వాత 17వ తేదీన లాటరీ వచ్చిన వారికి బార్లు కేటాయిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కమిషనర్‌ కార్యాలయంతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి డీసీ కార్యాలయాల్లో, రాష్ట్రంలోని మిగిలిన పట్టణ ప్రాంతాల్లో మాత్రం జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయంతో పాటు డిప్యూటీ కమిషనర్, కమిషనర్‌ కార్యాలయాల్లో కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు దొరకుతాయి. దరఖాస్తు ఫీజు కింద రూ. లక్ష వసూలు చేస్తారు. గతంలో ఉన్న 1,030 బార్లకు తోడుగా మున్సిపాలిటీల్లో మరో 159 అందుబాటులోకి వస్తాయి.

ఒకే పేజిలో..

ఈ మారు దరఖాస్తు చేసుకునే విధానాన్ని సులభతరం చేసి ఒకే పేజీలోనే తయారు చేశారు. మూడు కలర్‌ పాస్‌పోర్టు ఫొటోలు, స్వీయ ధ్రువీకరణతో కూడిన పాన్‌కార్డు లేదా ఆధార్‌కార్డు మాత్రమే దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. లాటరీ పూరయిన తర్వాత 90 రోజుల్లోగా ఎక్సైజ్‌ శాఖ నిర్దేశించిన అన్ని నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే మరో 60 రోజులు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. కానీ ఈ కాలానికి మొదటి వాయిదా లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలన్నీ పూర్తయ్యాకనే బార్‌ లైసెన్స్‌ జారీ చేస్తామన సంబంధిత శాఖ స్పష్టం చేసింది. ఎక్సైజ్‌ శాఖ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news