సవతి తల్లిపై లైంగిక దాడికి పాల్పడిన కొడుకు…

-

ఒడిశాలోని 20 ఏళ్ల యువకుడు సవతి తల్లి వద్ద ఉంటున్న తన తండ్రిని నరికి చంపాడు. ఆ తర్వాత ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టోమ్కా పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి మొదటి భార్య చనిపోయింది. దీంతో అతడు ఒక మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ వ్యక్తికి 20 ఏళ్ల ఒక కుమారుడు ఉన్నాడు. అయితే తండ్రితో కలిసి అతడు ఉండేందుకు సవతి తల్లి ఒప్పుకో లేదు. దీంతో ఆ యువకుడు వేరే గ్రామంలో నివసిస్తున్నాడు. తండ్రితో కలిసి తనను ఉండనివ్వకపోవడంపై వారి మధ్య గొడవలు తరుచుగా జరుగుతున్నాయి. ఆ యువకుడు ఆదివారం రాత్రి తండ్రి ఇంటికి వెళ్ళాడు. సవతి తల్లిని తిట్టడంతోపాటు ఆమె పట్ల మొరటుగా ప్రవర్తించాడు. దీంతో తండ్రి జోక్యం చేసుకున్నాడు. భార్యకు మద్దతుగా తండ్రి మాట్లాడాడు.

What Constitutes a Crime?

ఈ నేపథ్యంలో వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో తండ్రిపై దాడి చేసి నరికి హతమార్చాడు. అనంతరం సవతి తల్లిపై లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. మరోవైపు బాధితురాలు ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హత్యకు గురైన వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సవతి తల్లి ఫిర్యాదు ఆధారంగా అతడిపై కేసు నమోదు అయ్యింది. అనంతరం సోమవారం ఆ యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని ఎందుకు హత్య చేశాడు, సవతి తల్లిపై అత్యాచారానికి ఎందుకు పాల్పడ్డాడు అన్న దానిపై ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news