2022 ఎన్నో ఆనందాలు ఇచ్చింది.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ పోస్ట్..

-

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార గత ఏడాది కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అంతేకాకుండా ఈ జంట ఇద్దరు కవల పిల్లలకు కూడా జన్మనిచ్చారు అయితే తాజాగా 2022 పూర్తయి కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా విజ్ఞేశ్ శివన్ ఓక ఎమోషనల్ పోస్ట్ ను ఉంచారు..

తాజాగా కొత్త సంవత్సరం వచ్చేసింది సెలబ్రిటీలు అందరూ ఎంతో ఆనందంగా కొత్త సంవత్సరానికి వెల్కం పలికారు అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ న్యూ ఇయర్ విశేషాలు కూడా పంచుకున్నారు అయితే ఈ సందర్భంగా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. గత ఏడాది తనకి ఎదురైనా అనుభవాలను చెప్పక వచ్చారు..

గత ఏడాది కొన్ని చిక్కులు వచ్చిన ఎప్పటికీ 2022 నేను మర్చిపోలేనిదని అన్నారు అలాగే ఈ ఏడాది తనకు ఎన్నో ఆనందాలు దక్కాయని చెప్పుకొచ్చారు.. అలాగే తన ప్రేయసి నయనతారతో పెళ్లి, ఇద్దరు కవల పిల్లలు తన జీవితంలోకి రావడం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ గౌరవం దక్కడంతోపాటు.. లైకాతో సినిమాఫిక్స్ అవ్వడం.. ఇలా తన జీవితంలో అద్భుతాలు అన్నీ 2022లోనే జరిగాయన్నారు.

కోలీవుడ్ దర్శకుడు విగ్నేశ్ శివన్ నయనతార 2016 నుంచి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే అయితే వీరిద్దరూ అప్పుడే రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారు కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు అయితే తాజాగా గత ఏడాది అందరి సమక్షంలో జూన్లో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కారు ఆ తర్వాత నాలుగు నెలలకే సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు అయితే ఈ విషయం కాస్త వివాదంగా మారడంతో వీరిద్దరూ ఆరేళ్ళ క్రితమే పెళ్లి చేసుకున్నట్టు ఈ విషయంపై జరిగిన విచారణలో తెలిపినట్టు సమాచారం.. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉంటూ పిల్లలతో లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news