Breaking : గుంటూరులో మూడు కార్లు దగ్దం

-

గుంటూరు జిల్లాలోని స్థంభాల గరువు నర్సిరెడ్డి పాలెంలో అనుమానాస్పదంగా మూడు కార్లు దగ్దం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. పార్క్ చేసిన కార్లలో మంటలు ఎగసిపడ్డాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించినట్లు స్థానికులు భావిస్తున్నారు. అయితే.. దీనిపై వెంటనే స్థానికులు పోలీసులతో పాటు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే.. దీంతో వెంటనే.. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలార్పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో సైతం ఓ కారు తగలబడింది.

Car catches fire in Hyd, none hurt

ఎయిర్ పోర్ట్ నుంచి మూసాపేట కు వెళ్తున్న కారులో ఇంజన్ లో నుంచి పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్‌, ప్రయాణికులు వెంటనే కారునుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. అయితే.. 5 నిమిషాల్లో మంటలు చెలరేగి, కారంతా వ్యాపించాయి. దీంతో కారు పూర్తిగా దగ్గదమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ హాని జరుగలేదు. ఈ మేరకే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news