తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త.. దీపావళికి PRC విడుదల

-

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం అదిరిపోయే శుభవార్త చెప్పింది. దసరాకు ఓ అదిరిపోయే కానుక అందించేందుకు సిద్ధమయింది ఆర్టీసీ యాజమాన్యం. గత కొన్ని రోజులుగా ఆదాయాన్ని పెంచుకుంటున్న తెలంగాణ ఆర్టీసీ… కార్మికులకు దీపావళికి కానుక అందించనుంది.

చాలాకాలంగా కార్మికులు ఎదురుచూస్తున్న 2013 పిఆర్సి బకాయిలను దీపావళికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఆర్టీసీ సంస్థ. ఇందుకోసం ఏకంగా 210 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించినట్లు సమాచారం అందుతుంది.

అయితే 2013, 2017, 2021 పి ఆర్ సి తో పాటు ఇతర బకాయిలతో కలిపి సుమారు 2000 కోట్ల వరకు ఆర్టీసీ చెల్లించాల్సి ఉంది. అయితే లోటు బడ్జెట్ కారణంగా ఆ మొత్తాన్ని ప్రస్తుతం చెల్లించలేక పోతుంది ఆర్టీసీ యాజమాన్యం. ప్రస్తుతానికి 2013 పిఆర్సిని ఈ దీపావళికి అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news