భాగ్యనగర వాసులకు అలర్ట్​.. రేపు 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

-

హైదరాబాద్ నగర వాసులకు దక్షిణ మధ్య రైల్వే బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం పూట కాస్త సరదాగా బయటకు వెళ్దామని ఎంఎంటీఎస్ సర్వీసులు వినియోగించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఆ ప్లాన్ మానుకోండి. ప్లాన్ బి రెడీ చేసుకోండి. ఎందుకంటే రేపు హైదరాబాద్​లో ఎంఎంటీఎస్​ రైళ్లను భారీగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 31న ఆదివారం 34 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

లింగంపల్లి-ఫలక్​నుమా రూట్‌లో 9 సర్వీసులు రద్దు కాగా.. హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లోనూ 9 సర్వీసులు రద్దైనట్లు తెలిపింది. ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7 సర్వీసులు రద్దు కాగా.. లింగంపల్లి-ఫలక్ నుమా రూట్‌లో 7 సర్వీసులు రద్దు చేసినట్లు పేర్కొంది. లింగంపల్లి – సికింద్రాబాద్ రూట్‌లో ఒక్క సర్వీసు రద్దు మాత్రమే రద్దు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

నిర్వహణ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు స్వల్ప అంతరాయం కలుగుతోందని చెప్పింది. రేపు ఒక్కరోజు ప్రయాణికులు సర్దుకోవాలని తిరిగి సోమవారం యథావిధిగా ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news