ఏపీలో నేడు 2,183 ప‌రీక్షలల్లో 4 పాజిటివ్ కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు గ‌త కొద్ది రోజుల నుంచి త‌క్కువ సంఖ్య‌లో న‌మోదు అవుతున్నాయి. ప్ర‌తి రోజు 5 కేసుల లోపే పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కొన్ని రోజుల్లో కేవ‌లం ఒక్క పాజిటివ్ కేసు మాత్ర‌మే నిర్ధార‌ణ అయింది. కాగ ఈ రోజు క‌రోనా వైర‌స్ బులిటెన్ ను ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 2,183 కరోనా నిర్ధార‌ణ ప‌రీక్షల‌ను నిర్వ‌హించారు.

ఈ ప‌రీక్షల్లో కేవలం 4 క‌రోనా పాజిటివ్ కేసులు మాత్ర‌మే వెలుగు చూశాయి. ఒక్క ఏలూరు జిల్లాలోనే 3 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. అలాగే తిరుప‌తి జిల్లాలో ఒక్క కేసు వెలుగు చూసింది. కాగ ఈ రోజు క‌రోనా మ‌ర‌ణాలు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో న‌మోదు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 7 గురు క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news