బ్రేకింగ్ : గ్యాస్ లీక్‌ తో న‌లుగురు మృతి.. ఎక్కడో తెలుసా..?

-

గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలోని ధోలి గ్రామంలో గ్యాస్ లీక్ అయిన ఘ‌ట‌న‌లో నలుగురు మృతిచెందారు. సిమెజ్ సమీపంలో ఉన్న చిరిపాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రసాయన వ్యర్థాలతో నిండిన‌ ట్యాంక్ శుభ్రం చేయడానికి కార్మికులు ట్యాంక్‌లోకి దిగినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ నితేష్ పాండే తెలిపారు.

అయితే లోప‌లి నుంచి వెలువ‌డిన‌ విష వాయువుల కార‌ణంగా న‌లుగురు కార్మికులు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే విశాఖ పరవాడలోని ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం జరిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మనకు తెలిసిందే. కంపెనీ అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్మికులు ప్రాణాలు పోగుట్టుకుంటున్నారంటూ పలువురు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news