ఏపీలో కొత్తగా 4 ఓమిక్రాన్ కేసులు..28కి చేరిన సంఖ్య

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… తాజాగా మరో నాలుగు ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరుకుంది. ఇవాళ నమోదు అయిన నాలుగు కేసులలో ఇద్దరూ యూకే నుంచి వచ్చిన వారు కాగా ఒకరు అమెరికా, మరొకరు కాంటాక్ట్ కావడంవల్ల ఒమిక్రాన్ సోకింది. ఇందులో ముగ్గురు మగవాళ్ళు, ఒక మహిళా ఉంది.

అలాగే వీరిలో ముగ్గురు ప్రకాశం జిల్లాకు చెందిన వారు కాగా ఒకరు గుంటూరు కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అధికారులు. కాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 334 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2077942 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఒక్కరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 499 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1516 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news