ఏపీలో షర్మిల పార్టీ.. మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

-

షర్మిల.. ఏపీలో పార్టీ పెట్టడంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. షర్మిల ఎవరు.. ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చన్నారు కానీ ఏపీలో పార్టీ పెడతామని చెప్పలేదని వివరించారు. షర్మిల ఏపీలో పార్టీ పెడతారని అభూత కల్పనలు చేస్తున్నారని.. షర్మిలమ్మ మేము అంతా వైయస్సార్ కుటుంబం.. మేమంతా ఒకటేనని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన విద్యుత్ బకాయిలు కూడా ఇప్పుడు తీరుస్తున్నామని.. చంద్రబాబు పోలవరంలో ఏమి చేసారో అందరికి తెలుసు అని వెల్లడించారు.

రాజధానికి ఆయన చేసిందేమీ లేదు.. అందుకే ఓడి పోయారని.. చంద్రబాబులా జగన్ ఎవరిని యాచించే వ్యక్తి కాదని చెప్పారు. రోజుకో పార్టీతో పొత్తు పెట్టుకుంటారని.. న్నికల ముందు రాహుల్ గాంధీ చుట్టూ తిరిగాడని మండిపడ్డారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టామని ఎన్టీఆర్ చెబితే అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారు. జగన్ కాంగ్రెస్ తో కలిస్తే కేసులు మాఫీ చేసేవారని.. కేంద్రంలో ఉన్న సోనియాను కూడా జగన్ ఎదిరించి పార్టీ పెట్టారని వెల్లడించారు. చంద్రబాబు పై ఏమైనా కేసులు పెడితే ఏదోలా స్టే తెచ్చుకుంటారని.. సీఎం జగన్ ప్రధానిని కలిస్తే కేసుల మాఫీ కోసం వెళ్లాడని అంటరాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 29 సార్లు ఎందుకు కలిశారు.. చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయిందని ఎద్దేవా చేశారు..

Read more RELATED
Recommended to you

Latest news