ఏపీలో నేడు కొత్త‌గా 41 క‌రోనా కేసులు.. 400 లోపే యాక్టివ్ కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు గ‌త కొద్ది రోజుల నుంచి 50 లోపే న‌మోదు అవుతున్నాయి. ఈ రోజు కూడా రాష్ట్రంలో 50 లోపే క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. అయితే నిన్న‌టి తో పోలిస్తే.. నేడు ఒక్క క‌రోనా కేసు పెరిగింది. ఈ రోజు క‌రోనా వైర‌స్ బులిటెన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 41 క‌రోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

కాగ ఏపీలో అత్య‌ధికంగా అనంత‌పురం జిల్లాలో 15 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే రెండు జిల్లాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాలేదు. కాగ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 75 మంది క‌రోనా వైర‌స్ బాధితులు పూర్తిగా కోలుకున్నారు. అలాగే ఈ రోజు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 10,502 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news