యాదాద్రి అభివృద్ధి కోసం రూ.43 కోట్ల నిధులు విడుదల

-

యాదాద్రి ఆల‌య అభివృద్ధి కోసం కేసీఆర్‌ సర్కార్‌ చాలా ఖర్చు చేస్తోంది. ఇక తాజాగా ఆలయ అభివృద్ధి కోసం.. మరో రూ.43 కోట్లు రిలీజ్‌ చేసింది తెలంగాణ సర్కార్‌. నిన్న యాదాద్రి ఆల‌యంలో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆల‌య దివ్య విమాన గోపుర‌మున‌కు బంగారు తాపడం కోసం.. కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని కేసీఆర్ మ‌నుమ‌డు హిమాన్షు అందించారు. పూజ‌ల అనంత‌రం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

కుటుంబ స‌మేతంగా ద‌ర్శ‌నానికి వ‌చ్చిన కేసీఆర్‌కు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ భూమిలో ఆలయ అవసరాలు, పోలీసుశాఖ, ఫైర్ స్టేషన్, హెల్త్, రవాణా, పార్కింగ్ వంటి యాదాద్రి అభివృద్ధికి సంబంధించిన అనుబంధ సేవల కోసం మాత్రమేనని, ఆలయ అర్చకులకు, సిబ్బందికి కూడా ఇందులోనే ఇళ్ల స్థలాలు ఉంటాయని, యాదాద్రిలో ఉన్న విలేకరులకు వైటీడీఏ బయటప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news