ఏపీలో కరోనా టెర్రర్.. కొత్తగా 4,348 కేసులు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి కాస్త పెరిగాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ 4000 దాటాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 4348 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,92, 227 కి పెరిగింది.

ap carona
ap carona

ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 507 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14204 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 261 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 63, 516 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 47, 884 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 17, 56, 521 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news