కోల్ ఇండియాలో 481 ఉద్యోగాలు..దరఖాస్తుల స్వీకరన ప్రారంభం..

-

భారత ప్రభుత్వ బొగ్గుగనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ ఇటీవల ఉద్యోగాలకు సంభంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే..ఇప్పుడు మరో నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది..481మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జూలై 8 నుంచి ప్రారంభమయింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

పర్సనల్‌ అండ్‌ హెచ్‌ఆర్‌,

ఎన్విరాన్‌మెంట్‌,

మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌,

మార్కెటింగ్‌, సేల్స్‌,

కమ్యునిటీ డెవలప్‌మెంట్‌,

లీగల్‌,

పబ్లిక్‌ రిలేషన్స్‌

ఈ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హులు: గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ పీజీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఎవరైనా అధికారిక వెబ్‌సైట్‌ https://www.coalindia.in/login/లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరన: జూలై 8 నుంచి ప్రారంభం..

దరఖాస్తుల చివరి తేదీ:ఆగస్టు 8 వరకు అన్‌లైన్‌ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

ఎంపిక: రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్షలో ప్రతిభ కనబరచిన వెంటనే పోస్టింగ్ ఇస్తారు.

జీతం: నెలకు రూ.1.60,000ల జీతంతో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా ఉద్యోగం పొందవచ్చు.
ఇతర పూర్తి వివరాల కోసం https://www.coalindia.in/ను సందర్శించవచ్చు…

ఆసక్తి కలిగిన వారు వెబ్ సైట్ లో పూర్తీ వివరాలు తెలుసుకోని అప్లై చేసుకొవాలి..

 

Read more RELATED
Recommended to you

Latest news