Breaking : 5వ రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 1631 ఓట్ల ఆధిక్యం

-

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కి ఫలితాలు మారుతుండడంతో ఉత్కంఠగా మారింది. పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఆధిక్యం రాగా, 2,3,4 రౌండల్లో బీజేపీ ఆధిక్యం కనపరిచింది. అయితే తాజాగా 5వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసింది. 5వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 917 ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో 5వ రౌండ్‌ ముగిసే సరికి మొత్తంగా టీఆర్‌ఎస్‌ 1631 ఓట్ల మెజార్టీతో ఉంది. అయితే.. ఈ ఐదవ రౌండ్లో కాంగ్రెస్‌కు ఓట్లు రాకపోవడం గమనార్హం.5వ రౌండ్‌లో టీఆర్ఎస్ 6162, బీజేపీ- 5245 ఓట్లువచ్చాయి. అయితే.. దీంతో.. టీఆర్‌ఎస్ 917 లీడ్‌లో ఉంది. 5 రౌండ్లు ముగిసే సరికి టీఆర్‌ఎస్ లీడ్ 1631 ఓట్ల లీడ్ వచ్చింది.

Telangana Munugode By Election Results 2022: Counting Of Votes Begins For Munugode  Bypoll | Munugode Bypoll Result 2022: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం,  మధ్యాహ్నానికి తేలనున్న విజేత

అంతకుముందు.. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 714 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఫలితాల వివరాలను కౌంటింగ్ అధికారులు వెల్లడించడం లేదని కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధుల ధర్నాకు దిగారు. అధికారులు కౌంటింగ్ సంబంధించిన వివరాలను మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news