నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5395 పోస్టులు.. 10వ తరగతితో పాటు ఈ అర్హతలు ఉండాలి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? ఆయితే మీకు గుడ్ న్యూస్. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధి లోని నాగ్‌పుర్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్‌ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా వున్నాయి. జాబ్‌ నోటిఫికేషన్‌ ని కూడా విడుదల చేసారు.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 57వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్‌ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 5,395 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మెదక్‌ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు వున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 28లోగా ఆన్‌లైన్‌ లో ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి వుంది.

మొత్తం ఖాళీలు 5,395 ఉండగా… ఐటీఐకు సంబంధించి 3508 ఖాళీలు వున్నాయి. నాన్ ఐటీఐకు సంబంధించి 1887 ఖాళీలు వున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.200 గా వుంది. మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ మొదలైన పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఐటీఐ కి సంబంధించి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. 28.03.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాలు ఉండాలి. పూర్తి వివరాలని https://www.yantraindia.co.in/career.php లో చూసి అప్లై చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news