ఏపీలో నేడు కొత్త‌గా 54 క‌రోనా కేసులు.. జీరో మ‌ర‌ణాలు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో కోర‌నా కేసుల సంఖ్య రోజు రోజుకు స్వ‌ల్పంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ప్ర‌తి రోజు కేసుల సంఖ్య గ‌తంతో పోలిస్తే త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అలాగే క‌రోనా మ‌ర‌ణాలు కూడా సంభ‌వించ‌డం లేదు. దీనికి తోడు క‌రోనా రిక‌వ‌రీ కూడా ఎక్కువ‌గానే ఉంది. దీంతో రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితులు సాదార‌ణానికి వ‌స్తున్నాయి. కాగ నేటి క‌రోనా బులిటెన్ ను ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 54 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

అలాగే నేడు కూడా రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో క‌రోనా మర‌ణాలు న‌మోదు కావ‌డం లేదు. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా.. 57 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 507 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 11,594 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news