హర్యానాలో దారుణం.. మహిళపై కుటుంబ సభ్యులు గ్యాంగ్ రేప్

-

మన దేశంలో రోజురోజుకు మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా… మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. మొన్న హైదరాబాద్ లో ఎనిమిదేళ్ల బాలికపై దాడి… మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానా రాష్ట్రంలోని… ఓ మహిళ పై ఏకంగా ఎనిమిది మంది గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

అంతేకాదు ఆ వివాహిత పై అనేక నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు ఆఅ దుండగులు. బాధితురాలు హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానా పోలీసుల ప్రకారం, మామతో సహా ఎనిమిది మంది ఆ బాధిత మహిళ పై పలుమార్లు గ్యాంగ్ రేప్ చేసారు.

కట్నం కోసం తరచూ బాధితురాలి భర్త వేధించేవాడని… ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య గొడవ వచ్చేదని పోలీసులు తెలిపారు. ఇక కట్నం తేవకపోవడం తో…. ఆ మహిళపై భర్త కుటుంబ సభ్యులే ఎనిమిది మంది దారుణంగా రేప్ చేశారనీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసుకున్నామని స్పష్టం చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news