హైదరాబాద్ లో 13 ఏళ్ల బాలిక మిస్సింగ్.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో !

-

హైదరాబాద్‌ నగరంలో మరో కిడ్నాప్‌ కేసు నమోదు అయింది. హైదరాబాద్‌ నగరంలోని కవాడిగూడలో 13 ఏళ్ల బాలిక అదృశ్యమైన బాలిక మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాలిక మిస్సింగ్ పై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నిన్న ఉదయం బయటకి వెళ్ళిన బాలిక అదృశ్యం ఘటన కలకలం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కవాడిగూడలో బాలిక ఆటో ఎక్కినట్టు గుర్తించారు. ఆటోను ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే స్నేహపురి కాలనీలో బాలిక ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. సిగ్నల్స్ ఆధారంగా రెండు బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news