హైదరాబాద్ లో విషాదం..కోడలును చంపిన అత్త-మామ !

-

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ లో విషాదం చోటు చేసుకుంది. నందినీ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గది లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణం చేసుకుంది.అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు భరించలేక తనువు చాలించింది నందిని. అయితే.. తమ బిడ్డను చిత్ర హింసలు పెట్టి భర్త, అత్తమామలు హత్య చేసి….. ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ నందినీ పేరెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు.

ఒంటిపై గాయాలు ఉన్నాయి. అతి దారుణంగా నా బిడ్డను కొట్టి చంపేసారు…. గత కొన్న రోజులుగా అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు చేస్తున్నారని నందినీ పేరెంట్స్ చెబుతున్నారు. నీ బిడ్డ చనిపోయింది వచ్చి శవాన్ని తీసుకొని వెళ్లండంటూ మాకు ఫోన్‌ చేశారని…వారు తెలిపారు. ఈ తరుణంలోనే.. రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది నందినీ కుటుంబం. దీంతో 304 B సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు… భర్త రత్నదీప్ ను అరెస్ట్ చేశారు. పరారీలో అత్తమామ విజయ, లక్ష్మన్ రావు ఉన్నారు. తమ బిడ్డను చంపడమే కాకుండా ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు… కేసు వాపస్ తీసుకోకపోతే చంపుతామంటూ కాల్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నందినీ పేరెంట్స్.

Read more RELATED
Recommended to you

Latest news