డబ్బుల కోసం భార్యతో వ్యభిచారం చేయించిన భర్త !

-

పెళ్లంటే నూరేళ్లపంట అంటారు పెద్దలు. పెళ్లి చేసుకుని తన భార్యను నిండు నూరేళ్లు సంతోషంగా చూసుకోవాల్సిన భర్త తన భార్యను పరాయి వ్యక్తులకు సొంతం చేశాడు. వివరాల్లోకి వెళితే, బీహార్ లోని రజక్పేట మండలం తిప్పనూరు కాలనీలో సంతోష్(28), హారిక(26) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. రెండు నెలలుగా వీరు చాలా సంతోషంగా ఉంటున్నారు. సంతోష్ ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

హారిక ఇంట్లోనే ఉండేది. తన భార్య ఎలాంటి పని చేయడం లేదని, బయట ఆడవాళ్లు ఎంతో డబ్బు సంపాదిస్తున్నారంటు సంతోష్ తన భార్యను హింసించడం మొదలుపెట్టాడు. ఒకరోజు సంతోష్ స్నేహితులు వారి ఇంటికి వచ్చి పార్టీ చేసుకుంటున్నామని చెప్పి విచ్చలవిడిగా మద్యం మత్తులో మునిగిపోయారు. మరొక గదిలో నిద్రిస్తున్న తన భార్యపై తన స్నేహితులతో కలిసి అఘాయిత్యం చేయించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తనను చంపేస్తానంటూ బెదిరించాడు సంతోష్.

ఇలా రోజులు గడుస్తున్నా కొద్ది రోజు ఎవరో ఒకరిని ఇంటికి తీసుకువచ్చి తన భార్యతో పడుకోబెట్టి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. హారిక ఎదురు తిరగడంతో తనను కొట్టి కట్టేసి మరీ చిత్రహింసలు పెట్టేవాడు. దీంతో ఏమీ చేయలేని హారిక మౌనంగా ఉండేది. ఒకరోజు ఇంట్లో నుంచి హారిక తప్పించుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఈ విషయం తెలియని తన భర్త స్నేహితులను తన ఇంటికి తీసుకువచ్చాడు. పోలీసులు సడన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news