చిన్నారిని సంపులో పడేసింది చైన్‌స్నాచర్‌ కాదు.. తల్లే.. షాకింగ్‌ విషయాలు వెలుగులోకి

-

ఓ మహిళ తల్లి అనే పేరుకే మచ్చ తెచ్చింది. కూతురు ఆరోగ్యం లేదని కర్కశత్వంగా కాటికి పంపింది… ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఏడాది వయసున్న చిన్నారిని ఎత్తుకొని రోదిస్తూ ఆస్పత్రికి పరుగొత్తుకొచ్చింది జనగామ పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌లో నివాసం ఉంటున్న ప్రసన్న అనే మహిళ. సోమవారం (ఆగస్టు 1) ఉదయం తన ఇంటి ముందు బిడ్డను ఎత్తుకొని ఉండగా.. ముసుగు వేసుకొని వచ్చిన ఓ దొంగ తన మెడలో నుంచి పుస్తెలతాడు దొంగిలించేందుకు ప్రయత్నించాడని, తాను తీవ్రంగా ప్రతిఘటించానని చెప్పింది. తప్పించుకునే క్రమంలో ఆ దుండగుడు.. తన చేతిలో ఉన్న చిన్నారి తేజస్వినిని బలవంతంగా లాక్కొని పక్కనే ఉన్న నీటి సంపులో పడేసి అక్కడి నుంచి పారిపోయాడని తెలిపింది. చిన్నారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆ బిడ్డ మృతి చెందినట్లు నిర్ధరించారు. ఆభరణాల కోసం దొంగలు ఇంతకు తెగించారనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మహిళను, స్థానికులను ప్రశ్నించి వివరాలు సేకరించారు.

పోలీసుల విచారణలో ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడతంలో మహిళపై అనుమానం వచ్చింది. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లోనూ ఎక్కడా ముసుగు దొంగకు సంబంధించిన దృశ్యాలు కనిపించకపోవడంతో వారి అనుమానం మరింత బలపడింది. ఆ మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా.. దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పసిబిడ్డను చేతులారా తానే సంపులో పడేసి, ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు పోలీసుల విచారణలో ఆ తల్లి అంగీకరించింది. పాపకు అనారోగ్య సమస్యలు ఉండటం, ఎదుగుదల సరిగా లేకపోవడంతో చేజేతులా చంపేసినట్లు తెలిపింది. మహిళపై హత్య కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు జనగామ సీఐ శ్రీనివాస్‌ వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news