ఆచార్య మూవీకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్… టికెట్ల ధరలపెంపు, అదనపు షోలకు అనుమతి

-

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘ ఆచార్య’. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీతో థియేటర్లకు రాబోతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు మణిశర్మ అందించిన మ్యూజిక్ అలరిస్తోంది. ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే కనిపించబోతోంది. 

ఆచార్య సినిమా ఎప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆచార్య మూవీకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్  చెప్పింది. టికెట్ ధరలతో పాటు అదనపు షోలకు అనుమతినిచ్చింది. తెలంగాణలో వారం రోజుల పాటు 5వ షోకు అనుమతి ఇచ్చింది. ఎప్రిల్ 29 నుంచి మే 5 వరకు టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ పై రూ. 50, సాధారణ థియేటర్లలో ఒక్కో టికెట్ పై రూ. 30 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news