నెల్లూరు జిల్లాలో దారుణం.. విద్యార్థిని గొంతు కోసి యాసిడ్ దాడి

-

నెల్లూరు నగరానికి సమీపంలో చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారం చేయబోయిన మేనమామ ఆమె ప్రతిఘటించడంతో గొంతు కోశాడు. అక్కడితో ఆగకుండా ఆమెపై యాసిడ్ పోశాడు. ముఖమంతా కాలిపోయి తీవ్రగాయాలపాలైన ఆ బాలిక ఇప్పుడు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన వెంకటాచలం మండలం చెముడు గుంట నక్కల కాలనీలో జరిగింది.

వెంకటాచలం మండలం చెముడు గుంటలోని ఓ కాలనీలో 9వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార ప్రయత్నం జరిగింది. బాలిక తండ్రి ఆ సమయంలో ఇంట్లో లేరు. తల్లి కూడా పనిపై బయటకు వెళ్లడంతో ఇంట్లో బాలిక ఒక్కతే ఉంది. దీంతో బాలికపై అత్యాచారం చేయడానికి ఇదే అదునుగా భావించాడు మేనమామ నాగరాజు.

మేనమామ అత్యాచారానికి ప్రయత్నించడంతో వారించిన బాలిక బాత్రూం లోకి పరుగులు తీసింది. చివరకు బాత్రూం లో ఆమెను బంధించిన నాగరాజు అక్కడ యాసిడ్ తీసి ఆమెపై పోసాడు. కత్తితో గొంతు కోసి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. కొన ఊపిరిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news