మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో నటుడు సాయికిరణ్‌ ఫిర్యాదు

-

నువ్వేకావాలి సినిమా ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న నటులలో సాయికిరణ్ ఒకరు. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సాయికిరణ్ పలు సినిమాల్లో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈమధ్య సాయి కిరణ్ సినిమాలు చేసినప్పటికీ ఆయన పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు.

అయితే తాజాగా నటుడు సాయి కిరణ్ పోలీసులను ఆశ్రయించారు. 10 లక్షల రూపాయలు తాను మోసపోయానని అంటూ పోలీసు మెట్లు ఎక్కారు సాయికిరణ్. మన్న మినిస్ట్రీస్ సభ్యత్వం పేరు చెప్పి ఈ మొత్తాన్ని తన నుంచి వసూలు చేశారని ఆయన ఆరోపణలు చేశారు. లివింగ్ స్టెన్ పూ, జాన్ బాబు అనే వ్యక్తులపై సాయికిరణ్ ఫిర్యాదు చేయడం గమనార్హం.

ఈ మేరకు పోలీసులు 406 మరియు 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ తర్వాత చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నేపధ్య గాయకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న రామకృష్ణ కుమారుడు సాయి కిరణ్ కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news