మరోసారి రేటు పెంచేసిన నేషనల్ క్రష్… ఎంతో తెలిస్తే షాక్!

-

తన అందంతో అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్న హీరోయిన్‌ రష్మిక మందన. నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘శ్రీవల్లి’ తన రెమ్యునరేషన్‌ను మరోసారి పెంచేసిందట. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది. అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై’లో, అలాగే సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ‘మిషన్‌ మజ్ను’లోనూ నటిస్తుంది. రణ్‌వీర్‌ కపూర్‌ సినిమాలోనూ రష్మిక ఓ పాత్రలో మెరవబోతుంది.

ఇక ‘పుష్ప2’ సినిమా కోసం రష్మిక 4 కోట్ల రూపాయలు తీసుకోనుందట. ఈ సినిమా విడుదలకు ముందే తన పారితోషికాన్ని పెంచేసి ఇక పై ఒక్కో సినిమాకు 5కోట్ల రూపాయలు తీసుకోనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో ఆమెకు ఉన్న క్రేజ్‌ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్‌’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన అన్ని చోట్ల భారీ స్థాయిలో వసూళ్లను సొంతం చేసుకుంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల నిర్వహించిన సైమా (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌)వేడుకల్లో ఆరు అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమా రెండో భాగం ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది.

Read more RELATED
Recommended to you

Latest news