త్వరలో పశువులకూ ఆధార్ ఇస్తాం – నీతి ఆయోగ్ ప్రకటన

-

ఆధార్‌ కార్డులపై నీతి అయోగ్ కీలక ప్రకటన చేసింది. దేశంలో మనుషుల మాదిరిగానే పశువులకు కూడా త్వరలో ఆధార్ నంబర్ ఇవ్వనున్నట్లు నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. వాటి వివరాలను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రక్రియ మొదలైందన్నారు.

హైదరాబాదులో జరుగుతున్న బయో ఏషియా సదస్సులో ఆయన మాట్లాడారు. ఎలాంటి వ్యాధి పుట్టుక గురించి అయినా త్వరగా తెలుసుకుంటేనే దాని నివారణకు వ్యాక్సిన్, ఇతర మార్గాలను అన్వేషించడం సులభం అవుతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news